Advertisement

సిద్దిపేటలో నియామక ర్యాలీ






భారత వైమానిక దళం ఇస్తున్న పిలుపు
జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు నియామక ప్రక్రియలో భాగంగా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్రంలోని 31 జిల్లాల అభ్యర్థులకు పాల్గొనే అవకాశం కల్పించారు. ఇంటర్‌తోనే వైమానిక దళంలో చేరే అద్భుత అవకాశం ముంగిట వాలిన నేపథ్యంలో దీన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత యువకులపై ఉంది. జిల్లా కేంద్రంగా మారిన సిద్దిపేటలో తొలిసారిగా వైమానిక దళం ఈ నియామక ప్రక్రియ చేపడుతుండటం విశేషం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కనీసం 2,500 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తుండటం 


అభ్యర్థులు తీసుకురావాల్సినవి I
పదో తరగతి, ఇంటర్ ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు వాటి నకళ్లు.
ఒకవేళ అభ్యర్థులు ఉన్నత విద్యా భ్యాసం చేస్తుంటే పది, ఇంటర్ జిరాక్స్ ప్రతులతో పాటు ఒరిజి నల్ సర్టిఫికెట్లు తమ వద్ద ఉన్నాయని వారు చదివే విద్యా సంస్థ ప్రిన్సిపల్ నుంచి పత్రం తీసుకురావాలి.
I ఇతర జిల్లా, రాష్ట్రాల్లో చదివి ఉంటే, సొంత జిల్లా రెవెన్యూ అధికారుల నుంచి స్థానిక ధ్రువీకరణ పత్రం తేవాలి. | ఏడు పాసపోర్టు సైజ్ కలర్ ఫొటోలు.
నియామక పరీక్ష ఇలా..
నియామక పరీక్ష వివిధ దశల్లో ఉంటుంది. అన్ని అంచెల్లో విజయం సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి జాతీయ స్థాయి మెరిట్ పరిగణనలోకి తీసు కొని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
- భౌతీక పరీక్ష-1: 1.6 కి. మీ. పరుగు పందెన్ని 6 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయాలి..
* భౌతిక పరీక్ష-2: పుష్ అప్ 10, సిట్ అప్స్- 10, స్వ్కా ట్స్ - 20.



రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ పద్దతి)

రాత పరీక్ష - 1: ఆంగ్లం, రీజనింగ్, జనరల్ అవేర్ నెస్ పరీక్ష (50 ప్రశ్నలు - 45 నిమిషాలు)
రాత పరీక్ష - 2: సైకాలజీ (మనస్తత్వ శాస్త్రం) (45 ప్రశ్నలు - 30 నిమిషాలు)
ఓ బృంద చర్చ: 10-15 మందితో సమూహం ఏర్పాటు చేసి ఒక అంశంపై
చర్చకు అవకాశం ఇస్తారు. లేదంటే నిర్దేశిత అంశంపై అధికారి అడిగే ప్రశ్నలకు
సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆంగ్లంలోనే మాట్లాడాల్సి ఉంటుంది

వేదిక

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నియామక ప్రక్రియ పరీక్షలు జరుగనున్నాయి. ఇక్కడ నిరీక్షణ కేంద్రం, ధ్రువపత్రాల పరిశీలన కేంద్రం ఏర్పాటు చేశారు. భౌతిక పరీక్ష 2లోని మూడు అంశాల్లో ఇక్కడే అభ్యర్థులను పరీక్షి స్తారు. రాత పరీక్ష, బృంద చర్చలు ఈ కళాశాలలోనే నిర్వహిస్తారు.


• నాగదేవత ఆలయం నుంచి డిగ్రీ కళాశాల చౌరస్తా వరకు 18 కి. | మీ. పరుగు పందెం జరుగుతుంది.



Source:Eenadu

Post a Comment

0 Comments