Advertisement

siddipet district news - సిద్దిపేట సరిహద్దుగా ఐదు జిల్లాలు

4009fbdb-d5d0-4807-8c63-a428985f4ab0

44aafbf9-7132-4d6d-92e1-6aec27209121

సిద్దిపేటకు ఐదు జిల్లాల సరిహద్దులు
ప్రతిపాదిత సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఐదు జిల్లాలు సరిహద్దు జిల్లాలుగా మారనున్నాయి. 19 మండలాలు, 405 గ్రామాలు 3825.29 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో నూతనంగా సిద్దిపేట జిల్లా ఏర్పాటు కానుంది. 5,30,639 జనాభా కొత్త జిల్లాలో ఉండనుంది. సిద్దిపేటకు మెదక్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలు సరిహద్దు జిల్లాలుగా మారనున్నాయి.

ఐదు జిల్లాల పరిధిలోని సరిహద్దు గ్రామాలతో సిద్దిపేట జిల్లా బౌగోళిక విస్తీర్ణం రూపకల్పన జరిగింది. నిన్నటి వరకు మెదక్‌తో కలిసి ఉన్న మండలాలు సిద్దిపేటకు సరిహద్దు ప్రాంతాలుగా మారనున్నాయి. మెదక్‌లోని తూప్రాన్, చేగుంట, రామాయంపేట సరిహద్దు మండలాలుగా మారతాయి.

కూతవేటు దూరంలో..
సిద్దిపేట జిల్లా సరిహద్దులోని ఇల్లంతకుంట మండల పరిధిలోని సరిహద్దు గ్రామం పొత్తూరు నుంచి కిలోమీటర్‌ దూరం దాటితే కరీంనగర్‌ జిల్లా వస్తుంది. హుస్నాబాద్‌ మండలంలోని చివరి గ్రామం జిల్లెల్లగడ్డ నుంచి మూడు కిలోమీటర్లు దాటితే హన్మకొండ జిల్లా ప్రారంభం అవుతుంది.

ములుగు మండలం వంటిమామిడి నుంచి మూడు కిలోమీటర్లు వెళ్తే రంగారెడ్డి జిల్లా తుర్కపల్లి ప్రారంభం అవుతుంది. ముస్తాబాద్‌ మండలంలోని చిప్పలపల్లి నుంచి నాలుగు కిలోమీటర్లు దాటితే నిజామాబాద్‌ ప్రారంభం అవుతుంది. అలాగే జగదేవ్‌పూర్‌ మండలం ధర్మారం సరిహద్దు గ్రామం నుంచి కిలోమీటర్‌ వెళ్తే నల్లగొండ జిల్లా తగలనుంది.

Post a Comment

0 Comments